For Money

Business News

షేర్‌ బై బ్యాక్‌ ధర రూ. 10,000

బజాజ్‌ ఆటో ఇన్వెస్టర్లకు శుభవార్త. ఇవాళ జరిగిన బోర్డు సమావేశంలో కంపెనీ షేర్ల బైబ్యాక్‌కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఒక్కో షేర్‌ను రూ. 10,000లకు తిరిగికొనుగోలు చేయాలని కంపెనీ నిర్ణయించింది. టెండర్‌ పద్ధతిలో బైబ్యాక్‌ చేస్తారు. మొత్తం రూ. 4000 కోట్ల విలువైన షేర్లను ఈ బైబ్యాక్‌లో కొంటారు. కంపెనీ 2022లో ఒక్కో షేర్‌ రూ. 4,600 ధరకు బై బ్యాక్‌ చేసింది. ఇపుడు రెండో ఆఫర్‌ ప్రకటించింది. తొలి ఆఫర్‌ తరవాత షేర్‌ ధర రెట్టింపు అయిందనే చెప్పాలి. రెండోసారి బై బ్యాక్‌ను ప్రకటించగానే షేర్‌ ధర రూ. 7,000 దాటింది. ఇవాళ కూడా షేర్‌ రూ. 6,983 వద్ద ముగిసింది.