For Money

Business News

దావోస్‌లో జగన్, కేటీఆర్‌ భేటీ

విదేశీ పెట్టుబడుల ఆకర్షించడం కోసం తెలుగు రాష్ట్రాలు తీవ్రంగా పోటీ పడుతున్నాయి. ఏపీ సీఎం జగన్మోహన్‌ రెడ్డి దావోస్‌కు ఒక రోజు ముందుగానే చేరుకున్నారు. అక్కడ వివిధ పారశ్రామిక గ్రూప్‌ల అధినేతలతో చర్చలు జరుపుతున్నారు. నిన్న అదానీ గ్రీన్‌ ఎనర్జీతో భారీ ఒప్పందం కుదుర్చుకున్నారు. కేటీఆర్‌ దావోస్‌కు వెళ్ళే ముందు లండన్‌ వెళ్ళారు. అక్కడ పలు పారిశ్రామిక వేత్తలతో భేటీ అయ్యారు. జగన్‌ తరవాత ఒక రోజు ఆలస్యంగా దావోస్‌కు చేరారు. తొలిరోజే అనేక కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నారు. అలాగే హైదరాబాద్‌లో ఏర్పాటు చేయబోయే ఫార్మా సిటీని ప్రమోట్‌ చేస్తున్నారు. ఇద్దరు నాయకులు ఇపుడు దావోస్‌లో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా వీరిద్దరూ కలిసిన ఫోటోలు ఇపుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.