For Money

Business News

7న మంత్రి వర్గ పునర్‌వ్యవస్థీకరణ

ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ పునర్‌ వ్యవస్థీకరణకు ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్‌ నెల 7వ తేదీ అంటే గురువారం ఉదయం 9 గంటలకు కొత్త మంత్రులు పదవీ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. అంతకుముందే రోజు పాత మంత్రుల దగ్గర నుంచి సీఎం జగన్మోహన్‌ రెడ్డి రాజీనామాలను తీసుకోనున్నారు. కేబినెట్‌లోకి కొత్తగా తీసుకునే మంత్రులకు సంబంధించి సీఎం దాదాపు ఒక నిర్ణయానికి వచ్చారని… చివరి క్షణంలో ఏదైనా మార్పులు చేయడం తప్ప.. తుది కేబినెట్‌ ఖరారు అయినట్లు సమాచారం. కేబినెట్‌ నుంచి తొలగించేవారికి పార్టీ జిల్లా బాధ్యతలు అప్పగిస్తానని జగన్‌ ఇదివరకే నిర్ణయించిన విషయం తెలిసిందే.