For Money

Business News

అమూల్‌ పాల రేట్లు మళ్ళీ పెంపు

పాల ఉత్పత్తి కంపెనీలు మరోసారి ధరలు పెంచాయి. గత మార్చిలో ధరలు పెంచిన ఈ కంపెనీలు ఇవాళ మరోసారి ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. అమూల్‌ కంపెనీ తాను విక్రయించే ప్రధాన బ్రాండ్లు గోల్డ్, తాజా, శక్తి మిల్స్‌ ధరలను లీటరుకు రూ.2 చొప్పున పెంచుతున్నట్లు వెల్లడించింది. పెంచిన ధరలు ఇవాళ అర్ధరాత్రి నుంచే అమల్లోకి వస్తాయి. నిర్వహణా వ్యయం, పాల ఉత్పత్తి వ్యయం పెరిగినందున ఈసారి ధరలు పెంచినట్లు అమూల్‌ బ్రాండ్ల యజమాని అయిన గుజరాత్‌ కో ఆపరేటివ్‌ మిల్క్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ పేర్కొంది. ధరలను అన్ని మార్కెట్లలో పెంచినట్లు కంపెనీ తెలిపింది. తాజా పెంపుతో గుజరాత్‌లో అమూల్‌ గోల్డ్‌ పాలు అర లీటరు ధర రూ.31కి చేరింది. అమూల్‌ తాజా అర లీటరు రూ.25, అమూల్‌ శక్తి ధర రూ. 28కి పెంచినట్లు పేర్కొంది. అమూల్‌ నుంచి ప్రకటన వచ్చిన కొన్ని గంట్లోనూ మదర్‌ డెయిరీ కూడా తన ఉత్పత్తుల ధరలను లీటరుకు రూ.2 చొప్పున పెంచింది. పెంచిన ధరలు రేపటి నుంచే అమల్లోకి వస్తాయని కంపెనీ పేర్కొంది.