For Money

Business News

అదానీ చేతికి ఎన్‌డీటీవీ?

ఇటీవల కొన్ని మీడియా సంస్థలలో వచ్చిన వార్తల కారణంగా అదానీ గ్రూప్‌ కంపెనీల మార్కెట్‌ వ్యాల్యూయేషన్‌ లక్ష కోట్ల రూపాయల వరకు తగ్గిన విషయం తెలిసిందే. దీంతో మీడియా వ్యాపారంలో దిగాలని అదానీ గ్రూప్‌ నిర్ణయించింది. ఈ మేరకు కొంత మంది సీనియర్‌ జర్నలిస్టులను తీసుకుంది. తాజాగా అదానీ గ్రూప్‌ ఎన్డీటీవీని టేకోవర్‌ చేస్తుందన్న వార్త స్టాక్‌ మార్కెట్‌లో వైరల్‌గా మారింది. దీంతో స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో ఎన్‌డీటీవీ షేర్‌ 10 శాతం అప్ప సర్క్యూట్‌ను తాకింది. ఎన్‌ఎస్‌ఈలో ఎన్డీటీవీ షేర్‌ ప్రస్తుతం 79.85 వద్ద ట్రేడవుతోంది. ఈ ధర వద్ద మరో 2.79 లక్షల షేర్లు కొనేందుకు ఇన్వెస్టర్లు ఉన్నారు. అమ్మకం దారులు లేరు. ఇప్పటి దాకా జరిగిన లావాదేవీల్లో ఏకంగా 74 శాతం డెలివరీ షేర్లు కావడంతో ఈ కౌంటర్‌లో ఇన్వెస్టర్లకు ఆసక్తి పెరిగింది. స్టాక్‌ మార్కెట్‌లో వస్తున్న కథనాలపై ఎన్డీటీవీ ఇంకా స్పందించలేదు.