For Money

Business News

అదానీ చేతికి ప్రాంతీయ ఛానల్స్‌, పేపర్లు?

రిలయన్స్‌ గ్రూప్‌ మాదిరిగా మీడియా రంగంలో కూడా ఆధిపత్యం సాధించాలనే టార్గెట్‌తో అదానీ రంగంలోకి దిగారు. ఇప్పటికే ఏంఎంజీ మీడియా నెట్‌వర్క్స్‌ పేరుతో ఓ సంస్థను కూడా నెలకొల్పారు. అలాగే అదానీ మీడియా వెంచర్స్‌ను నడిపేందుకు సంజయ్‌ పుగాలియాను అదానీ గ్రూప్‌ నియమించింది. ఇప్పటికే దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ ఛానల్స్‌తో అదానీ గ్రూప్‌ చర్చలు జరుపుతోందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. టీవీతో పాటు ప్రింట్‌ మీడియాలో కూడా అడుగు పెట్టాలని అదానీ గ్రూప్‌ నిర్ణయించింది. వివిధ ప్రాంతీయ మీడియా సంస్థలతో ఇప్పటికే చర్చలు ప్రారంభించారని, ఇవి కొలిక్కి రావడానికి కొంత సమయం పట్టవచ్చని తెలుస్తోంది. న్యూస్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌, ఓటీటీ రంగాల్లో విస్తరించిన రిలయన్స్‌ తాజాగా స్ట్రీమింగ్‌ కంటెంట్‌ తయారీకి స్టార్‌ యజమాని జేమ్స్‌ మర్డోక్‌తో జత కట్టారు. దీనితో అదానీ ఏ సంస్థలను టేకోవర్‌ చేస్తారు? ఎలా పోటీ ఇస్తారనే చర్చ ఇపుడు మీడియాలో జరుగుతోంది.