For Money

Business News

16 నుంచి సుప్రియా లైఫ్‌సైన్స్‌ ఐపీఓ

సుప్రియా లైఫ్‌సైన్స్‌ పబ్లిక్‌ ఇష్యూ ఎల్లుండి అంటే ఈనెల 16వ తేదీన ప్రారంభం కానుంది. ఇష్యూ ధరల శ్రేణి రూ.265 – రూ.274. ఇష్యూ 20న ముగుస్తుంది. యాంకర్‌ ఇన్వెస్టర్‌లు ఒక రోజు ముందుగా డిసెంబరు 15న దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతిపాదిత ఇష్యూలో రూ.200 కోట్ల విలువైన తాజా షేర్లను కంపెనీ విక్రయించనుంది. ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) ద్వారా విక్రయించే షేర్ల పరిమాణాన్ని రూ.1000 కోట్ల నుంచి రూ.500 కోట్లకు సంస్థ తగ్గించింది. ఓఎఫ్‌ఎస్‌లో ప్రమోటరు సతీశ్‌ వామన్‌ వాఘ్‌ రూ.500 కోట్ల విలువైన షేర్లను విక్రయించనున్నారు. ప్రస్తుతం కంపెనీలో ప్రమోటరుకు 99.26 శాతం వాటా ఉండగా.. ప్రమోటరు గ్రూపు 0.72 శాతం వాటా కలిగి ఉంది.