123% పెరిగిన లాభం… అయినా ప్చ్…
సన్ ఫార్మా కంపెనీ ఫలితాలు మార్కెట్ను నిరుత్సాహపరిచాయి. మార్చితో ముగిసిన ఏడాదిలో కంపెనీ రూ. 1,513 కోట్ల నికర లాభం ప్రకటిస్తుందని మార్కెట్ అంచనా వేసింది. అయితే కంపెనీ కవేలం రూ. 894.2 కోట్ల నికర లాభం ప్రకటించింది.వాస్తవానికి గత ఏడాదితో పోలిస్తే కంపెనీ నికర లాభం 123 పెరిగింది. గత ఏడాది కంపెనీల పలు కోర్టు కేసులు, ఇతర వివాదాలు పరిష్కరించుకునేందుకు రూ.672.8 కోట్ల ఖర్చు చూపింది. దీంతో నికర లాభం భారీగా తగ్గింది. అయితే కంపెనీ టర్నోవర్ కూడా గత ఏడాదితో పోలిస్తే కేవలం 4 శాతం పెరిగి రూ. 8,523 కోట్లకు చేరడం కూడా మార్కెట్కు నిరాశ కల్గింది. రూ. 2 ఫైనల్ డివిడెండ్ ఇవ్వడానికి కంపెనీ డైరెక్టర్ల బోర్డు ప్రతిపాదించింది.