స్థిరంగా ప్రారంభం కానున్న నిఫ్టి!
గత శుక్రవారం భారీ లాభాలతో ప్రారంభమైన నిఫ్టి ఇవాళ నష్టాలతో లేదా స్థిరంగా ప్రారంభం కావొచ్చు. ప్రస్తుతం సింగపూర్నిఫ్టి 59 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. ట్రేడింగ్ ప్రారంభమయ్యే సరికి కాస్త కోలుకోవచ్చు. శుక్రవారం అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. డౌజోన్స్ గ్రీన్లో క్లోజ్గా, మిగిలిన రెండు సూచీలు రెండ్లో ముగిశాయి. అయితే లాభనష్టాలు నామ మాత్రమే. ఇక ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు కూడా మిశ్రమంగా ఉన్నాయి. అయితే ఇక్కడ కూడా లాభనష్టాలు అర శాతం లోపే ఉన్నాయి. జపాన్ నిక్కీ అరశాతంపైగా లాభంతో ఉంది. మిగిలిన మార్కెట్లలో పెద్ద ఉత్సాహం లేదు.