అమర రాజా లాభం రూ.189 కోట్లు
మార్చితో ముగిసిన త్రైమాసికంలో అమర రాజా బ్యాటరీస్ రూ.189 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన నికరలాభంతో రూ.137 కోట్లతో పోలిస్తే 38 శాతం అధికం. 2019-20 నాలుగో త్రైమాసికంలో రూ.1,581 కోట్లుగా ఉన్న కంపెనీ ఆదాయం గత త్రైమాసికానికి రూ.2,103 కోట్లకు పెరిగింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి రూ.7,150 కోట్ల ఆదాయంపై రూ.647 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఇబ్బందికర పరిస్థితుల్లోనూ ఉద్యోగుల చూపిన చొరవ వల్లనే ఆదాయ, లాభాల్లో వృద్ధిని సాధించినట్లు అమర రాజా బ్యాటరీస్ వైస్ చైర్మన్, ఎండీ జయదేవ్ గల్లా తెలిపారు. ప్రతిషేరుకు రూ.6 తుది డివిడెండ్ను బోర్డు ప్రతిపాదించింది.