విజయవాడలో పెట్రోల్ రూ.102.42
దేశంలో చమురు ధరలు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. బుధవారం మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెంచాయి. లీటర్ పెట్రోల్పై 25 పైసలు, డీజిల్పై 15 పైసల వరకు పెంచాయి. కొత్తగా పెంచిన ధరలతో దేశ రాజధానిలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.66కు చేరగా.. డీజిల్ రూ.87.41కు పెరిగింది. మే 4వ తేదీ నుంచి ఇప్పటి వరకు ఇంధన ధరలు 26వసార్లు పెరిగాయి. ఇప్పటి వరకు చమురు కంపెనీలు రూ.6.34, డీజిల్పై రూ.6.63 వరకు పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ ధర సెంచరీ కొట్టింది.
విజయవాడలో పెట్రోల్ రూ.102.42, డీజిల్ రూ.96.67కాగా, హైదరాబాద్లో పెట్రోల్ రూ.100.46, డీజిల్ రూ.95.28కు చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ రూ.96.66, డీజిల్ రూ.87.41, ముంబైలో పెట్రోల్ రూ.102.82, డీజిల్ రూ.94.84గా ఉంది.