రిలయన్స్ బోర్డులోకి ఆరామ్కో ఛైర్మన్?
గత కొన్ని రోజులుగా రిలయన్స్ షేర్ మార్కెట్లో ‘టాప్ 5 గెయినర్స్’ జాబితాలో ఉంటోంది. ఈనెలాఖరులో కంపెనీ సర్వ సభ్య సమావేశం (ఏజీఎం) జరగనుంది. ఈ సమావేశంలో కంపెనీ బోర్డులోకి సౌదీ అరేబియా చమురు కంపెనీ ఆరామ్కో ఛైర్మన్ యాసిర్ అల్ రుమయాన్ను తీసుకునే ప్రతిపాదనకు ఆమోదం లభించే అవకాశముంది. సౌదీ అరేబియా రాజుకు అత్యంత సన్నిహితుల్లో ఒకరైన యాసిర్కు చమురు రంగంపై గట్టి పట్టు ఉంది. రిలయన్స్ ఎనర్జి, ఆయిల్ విభాగంల 1500 కోట్ల డాలర్ల పెట్టుబడి పెట్టాలని ఆరామ్కో ఎప్పటి నుంచో భావిస్తోంది. యాసిర్ రాకతో ఈ ప్రతిపాదన త్వరలోనే కార్యరూపం దాల్చవచ్చు.