For Money

Business News

పెట్రో ధరల పెంపు… రూ. 100 దిశగా డీజిల్‌

రెండు రోజుల విరామం తరవాత ఇవాళ పెట్రోల్‌,డీజిల్‌ ధరలు పెరిగాయి. పెట్రోల్‌ లీటర్‌ ధరను 27 పైసలు, డీజిల్‌ ధరను 30 పైసలు చొప్పున ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు పెంచాయి. ముంబైలో పెట్రోల్‌ ధర రూ. 100.98కి చేరింది. దేశంలోని 135 జిల్లాలో పెట్రోల్‌ ధర రూ. 100 దాటింది. డీజిల్‌ రేట్లను కూడా భారీగా పెంచుతుండటంతో త్వరలోనే ఇది కూడా సెంచరీని దాటే అవకాశముంది. ఇప్పటికే రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్‌లో డీజిల్‌ ధర లీటరుకు రూ. 98కి చేరింది. ఇక్కడ ప్రస్తుతం పెట్రోల్‌ను రూ. 105.80లకు విక్రయిస్తున్నారు. ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు ప్రకటిస్తున్న ధరలు కన్నా మార్కెట్‌లో ధరలు అధికంగా ఉంటున్నాయి. ఆయా రాష్ట్రాల వ్యాట్‌కు అనుగుణంగా ధరలు మారుతున్నాయి.