నేడూ పెరిగిన పెట్రోల్ ధరలు
పెట్రోల్, డీజిల్ ధరలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇవాళ కూడా పెంచాయి. పెట్రోల్ లీటర్ ధరను 29 పైసలు, డీజిల్పై 30 పైసలు పెంచాయి. దీంతో ముంబైలో పెట్రోల్ ధర ఆల్టైమ్ హై రూ. 102.58లకు చేరింది. అలాగే డీజిల్ ధర రూ. 94.70కి పెరిగింది. రాష్ట్రాల్లో వ్యాట్ కూడా పెరుగుతుంది కాబట్టి.. వాస్తవ మార్కెట్ ధర ఇంకా ఎక్కువ ఉండే అవకాశముంది.