దుమ్ము రేపిన దొడ్ల, కిమ్స్
హైదరాబాద్కు చెందిన రెండు కంపెనీలు ఆకర్షణీయ లాభాలతో ఇవాళ లిస్టయ్యాయి. కిమ్స్ హాస్పిటల్ ఇష్యూ ధర రూ. 825 కాగా 22 శాతంపైగా లాభంతో రూ. 1009 వద్ద లిస్టయింది. ఇక హైదరాబాద్కే చెందిన మరో కంపెనీ దొడ్ల డెయిరీ కూడా 28.5 శాతం లాభంతో లిస్టయింది. ఈ కంపెనీ ఇష్యూ ధర రూ. 428 ఇవాళ ఎక్స్ఛేంజీల్లో రూ. 550 వద్ద లిస్టయింది.