దక్షిణాఫ్రికా టీ20 లీగ్పై ఐపీఎల్ ఓనర్ల కబ్జా
ఐపీఎల్ యజమానులు ఇపుడు దక్షిణాఫ్రికా క్రికెట్ లీగ్ను శాసించనున్నారు. మన ఐపీఎల్ మాదిరి దక్షిణాఫ్రికాలో కూడా దేశీయ టీ20 లీగ్ ప్రారంభమైంది. ఇందులో ఆరు టీమ్లు ఉన్నాయి. ఈ ఆరు టీమ్లను భారత్కు చెందిన ఐపీఎల్ యజమానులు కొనుగోలు చేయడం విశేషం. వచ్చే ఏడాది జనవరి నుంచి దక్షిణాఫ్రికాలో ఈ లీగ్ పోటీలు ఉంటాయి. ముంబై ఇండియన్ అధినేత అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ న్యూల్యాండ్స్ ఫ్రాంచైజీని చేజిక్కించుకుంది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ జోహన్నెబర్గ్ టీమ్ను కొనుగోలు చేయగా, ఢిల్లీ క్యాపిటల్స్ యజమాని అయిన జేఎస్డబ్ల్యూ స్పోర్ట్స్ ప్రెటోరియా ఫ్రాంచైజీని కొనుగోలు చేసింది. లక్నో సూపర్ జెయింట్స్ యజమాని డర్బన్, సన్రైజ్ హైదరాబాద్ పోర్ట్ ఎలిజిబెత్ రాజస్థాన్ రాయల్స్ పార్ల్ ఫ్రాంచైజీని కొనుగోలు చేశాయి.