For Money

Business News

ఢిల్లీ మద్యం స్కామ్‌: అరబిందో డైరెక్టర్‌ అరెస్ట్‌

ఢిల్లీ మద్యం స్కామ్‌లో అరబిందో ఫార్మా కంపెనీ డైరెక్టర్‌ శరద్‌ చంద్రారెడ్డిని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అరెస్ట్‌ చేసింది. సెప్టెంబర్ 21, 22, 23 తేదీల్లో ఢిల్లీలో అరబిందో గ్రూపునకు డైరెక్టర్‌గా ఉన్న శరత్ చంద్రారెడ్డిని ఈడీ అధికారులు పలుమార్లు ప్రశ్నించారు. అరబిందో గ్రూపులోని కంపెనీలతో పాటు సొంత కంపెనీల్లో కూడా శరత్ చంద్రారెడ్డి డైరెక్టరుగా ఉన్నారు. అరబిందో ప్రమోటర్ల కుటుంబానికి చెందిన ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ కంపెనీ డైరెక్టర్‌గా ఆయన ఉన్నారు. మద్యం కుంభకోణం కేసులో ట్రైడెంట్‌ కెమ్‌ఫామ్‌ను సీబీఐ తన ఎఫ్‌ఐఆర్‌‌లోచేర్చింది. ఢిల్లీ లిక్కర్ పాలసీకి అనుగుణంగా శరత్ చంద్రారెడ్డి ఈఎండీలు చెల్లించారు. ఈయన కంపెనీతో పాటు పలు బినామీ మద్యం షాపులకు కూడా ఈయన నిధులు సమకూర్చినట్లు వదంతులు ఉన్నాయి. శరత చంద్రా రెడ్డి ఎంపీ విజయసాయిరెడ్డికి దగ్గర బంధువు కావడం గమనార్హం. విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్‌ రెడ్డికి ఈయన స్వయానా అన్న.