For Money

Business News

జొమాటో షేర్‌లో ఒత్తిడి

జొమాటొ సహ వ్యవస్థాపకుడు గౌరవ్‌ గుప్తా రాజీనామా చేశారన్న వార్తతో ఆ కంపెనీ షేర్లలో భారీ అమ్మకాల ఒత్తిడి వచ్చింది. 2015లో కంపెనీ చేరిన గౌరవ్‌ 2018లో కంపెనీ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ స్థాయికి ఎదిగారు. 2019లో వ్యవస్థాకుల్లో ఒకరిగా మారారు. ఐపీఓ సమయంలో గౌరవ్‌ గుప్తా ముందుండి ఇన్వెస్టర్లకు విశ్వాసం కల్పించారు. గుప్తా రాజీనామా వార్తతో కంపెనీ షేర్‌ రూ 152.75 నుంచి రూ. 136.20కు పడిపోయింది. అంటే ఒకదశలో భారీ లాభాల్లోఉన్న షేర్‌ దాదాపు 5 శాతం క్షీణించింది. ఇపుడు కోలుకుని రూ.141.50 వద్ద ట్రేడవుతోంది.