For Money

Business News

25 శాతం పెరిగిన జీ షేర్‌

సోనీ పిక్చర్స్‌ డీల్‌తో జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ షేర్‌ జోరుగా పెరుగుతోంది. కంపెనీ సీఈఓ పునీత్‌ గోయెంకాను తొలగించాలన్న వాటాదారుల డిమాండ్‌తో జీ షేర్‌ రూ. 185 నుంచి పెరుగుతోంది. ఆ తరవాత కాస్త చల్లబడినా… తాజా వార్తలతో మళ్ళీ ఊపందుకుంది. సోనీ పిక్చర్‌తో కుదిరింది నాన్‌ బైండింగ్‌ ఒప్పందమైనా… షేర్‌ మార్కెట్‌లో జీ షేర్‌కు భారీ ఎత్తున డిమాండ్‌ లభిస్తోంది. దీంతో ఉదయం పది శాతం అప్పర్‌ సీలింగ్‌తో పెరిగిన ఈ షేర్‌ తరవాత 5 శాతం చొప్పున పెరుగుతూ వచ్చింది. 25 శాతం లాభంతో రూ. 319.60ని తాకింది. ఇపుడు రూ. 317 వద్ద 24 శాతం లాభంతో ట్రేడవుతోంది. జీతో పాటు డిష్‌ టీవీ, ఎన్‌డీటీవీ, టీవీ19 గ్రూప్‌ షేర్లు భారీ లాభాల్లో ఉన్నాయి.