For Money

Business News

కార్వీ సంస్థలపై ఈడీ దాడులు

ఇవాళ హైదరాబాద్‌లోని కార్వీ గ్రూప్‌ సంస్థలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దాడులు నిర్వహిస్తోంది. దాదాపు ఆరు చోట్ల దాడులు జరుగుతున్నట్లు సమచారం. మనీ లాండరింగ్ చట్టం కింద కార్వీ సంస్థలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇన్వెస్టర్ల షేర్లను బ్యాంకులో తనఖా పెట్టి వందల కోట్ల రూపాయల రుణాలను కార్వీ తీసుకుందని, ఆ నిధులను ఇతర సొంత కంపెనీలకు దారి మళ్ళించిందని బ్యాంకులు ఆరోపించాయి. నిధులు విదేశాలకు తరలించినట్లు ఆరోపణలు రావడంతో ఈడీ రంగంలోకి దిగింది.