For Money

Business News

జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఈజీఎం నిర్వహణ?

అసాధారణ సర్వ సభ్య సమావేశం (ఈజీఎం) నిర్వహణకు తాను ఇచ్చిన నోటీసును పట్టించు కోకుండా సోనీ పిక్చర్స్‌తో డీల్‌ చేసుకోవడంపై కంపెనీ ప్రధాన ఇన్వెస్టర్ ఇన్వెస్కో ఎన్‌సీఎల్‌టీ ముంబైని ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఇన్వెస్కో పిటీషన్‌లో పేర్కొన్నట్లు ఈజీఎం నిర్వహణపై కంపెనీ చట్టంలోని నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ గవర్నర్ల బోర్డుకు ఎన్‌సీఎల్‌టీ ఆదేశించింది. బోర్డు నుంచి ప్రమోటర్‌ పునీత్‌ గోయెంకాను తొలగించేందుకు ఈజీఎం నిర్వహించాలని ఇన్వెస్కో నోటీసు ఇచ్చింది. దీంతో ఇవాళ జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ గవర్నర్‌ బోర్డు ఇవాళ సమావేశమై ఇన్వెస్కో నోటీసులోని కొన్ని అంశాలను పరిశీలించనుంది. ఇవాళ కుదరని పక్షంలో రేపు బోర్డు సమావేశం కానుందని తెలుస్తోంది.