For Money

Business News

అదానీకి జడ్‌ కేటగిరి సెక్యూరిటీ

ప్రముఖ పారిశ్రామిక వేత్త, అదానీ గ్రూప్‌ అధినేత గౌతమ్‌ అదానీకి జడ్‌ కేటగిరి వీఐపీ సెక్యూరిటీ కల్పిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన దేశ వ్యాప్తంగా ఈ సెక్యూరిటీ లభిస్తుంది. అయితే ఇందుకు అయ్యే ఖర్చును గౌతమ్‌ అదానీ భరిస్తారు. నెలకు దాదాపు రూ. 15 లక్షల నుంచి రూ. 20 లక్షలు ఖర్చు అవుతుందని అంచనా. కేంద్ర నిఘా వర్గాలు అందించిన సమాచారం మేరకు అదానీ ప్రాణానికి ముప్పు ఉన్నందున ఈ భద్రత ఏర్పాటు చేశారు. గౌతమ్‌ అదానీ వీఐసీ సెక్యూరిటీని బాధ్యతను తీసుకోవాల్సిందిగా Central Reserve Police Force (CRPF)ను కేంద్రం ఆదేశించింది. 2013 నుంచి రిలయన్స్‌ గ్రూప్‌ అధినేత ముకేస్‌ అంబానీకి ఇదే తరహా జడ్‌ కేటగిరి వీఐసీ సెక్యూరిటీని కేంద్రం కల్పిస్తోంది.