For Money

Business News

”డిష్ టీవీ వేల కోట్ల దొంగ పెట్టుబడులు”

జీ టీవీ గ్రూప్‌నకు చెందిన డిష్‌ టీవీ కంపెనీ వాటాదారులకు తెలియకుండా నిధులు దారి మళ్ళించిందని ఎస్‌ బ్యాంక్‌ అనుమానిస్తోంది. డిష్‌ టీవీ నుంచి భారీ ఎత్తున పెట్టుబడులు జీ గ్రూప్‌ కంపెనీలకు తరలి వెళ్ళినట్లు ఎస్‌ బ్యాంక్‌ భావిస్తోంది. దీంతో డిష్‌ టీవీ ఖాతాలను ఫోరెన్సిక్‌ ఆడిట్ చేయాలని ఎస్‌ బ్యాంక్‌ నిర్ణయించినట్లు సమాచారం. ముఖ్యంగా వాచో (watcho) ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో డిష్‌ టీవీ రూ. 1,378 కోట్లు పెట్టుబడి పెట్టింది. దీనిపై ఎస్‌ బ్యాంక్‌కు అనుమానాలు ఉన్నాయి. వీటికి సంబంధించి మీడియాతో మాట్లాడేందుకు ఎస్‌ బ్యాంక్‌ యాజమాన్యం ఇష్టపడటం లేదు.