For Money

Business News

డిష్‌ టీవీ చేతులు మారనుందా?

జీ ప్రమోటర్‌ సుభాష్‌ చంద్ర చేతి నుంచి మరో కంపెనీ చేజారిపోనుందా? డిష్‌ టీవీకి ఎస్‌ బ్యాంక్‌ మధ్య కొనసాగుతున్న వివాదం కొత్త మలుపు తిరుగుతోంది. ఎస్‌ బ్యాంక్‌ ప్రతి ప్రతిపాదనను డిష్‌ టీవీ యాజమాన్యం తిరస్కరిస్తోంది. దీంతో డిష్‌ టీవీతో గొడవలు పడటంకంటే తన వాటాను మరో కంపెనీకి అమ్మాలను ఎస్‌ బ్యాంక్‌ యోచిస్తోంది. భారతీ ఎయిర్‌టెల్‌ లేదా టాటా స్కయ్‌కు వాటా విక్రయించేందుకు ఎస్‌ బ్యాంక్‌ యోచిస్తోంది. ఇదే సమయంలో డిష్‌ టీవీలోని ఇతర వాటాదారులు కూడా కంపెనీని నుంచి వైదొలగాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇతర వాటాదారులకు సుమారు 45 శాతం వాటా ఉంది. వీరందరూ కలిస్తే 65 శాతం వాటా అమ్మకానికి రెడీ అన్నమాట.