For Money

Business News

షియోమి రూ. 653 కోట్ల పన్ను ఎగ్గొట్టింది

చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్‌ తయారీదారుఉ షియోమి టెక్నాలజీ ఇండియా కంపనీ రూ. 653 కోట్ల పన్నును ఎగ్గొట్టినట్లు డైరెక్టరేట్ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) గుర్తించింది. ఆ మేరకు కంపెనీకి డిమాండ్‌ నోటీసు పంపింది. పన్ను ఎగ్గొట్టారనే అనుమానంతో ఇటీవలే ఈ కంపెనీకి చెందిన పలు కార్యాలయాలపై డీఆర్‌ఐ దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో కంపెనీ పన్ను ఎగ్గొట్టిందనడానికి ఆధారాలు సేకరించింది. అనేక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఆర్థిక శాఖ ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది.