For Money

Business News

షియోమి 11i…15 నిమిషాల్లో ఫుల్‌ చార్జ్‌

షియోమి కొత్త మోడల్‌ 11i హైపర్‌చార్జ్‌ ఫోన్‌ను జనవరి 6వ తేదీన భారత మార్కెట్‌లో ప్రవేశపెట్టనుంది. ఈ ఫోన్‌తో పాటు Mi 11X, 11X Pro, 11 Lite NE 5G ఫోన్లను కూడా మార్కెట్‌లో తేనుంది. దేశంలో ఇపుడు మార్కెట్‌లో లభిస్తున్న ఫోన్లలో అత్యంత వేగంగా చార్జ్‌ అయ్యే ఫోన్‌ 11i హైపర్‌చార్జ్‌ అని షియోమి అంటోంది. ఈ ఫోన్‌ 0 నుంచి వంద శాతం చార్జి కావడానికి కేవలం 15 నిమిషాలు తీసుకుంటుందని కంపెనీ వెల్లడించింది. చైనాలో ఈ ఏడాది ప్రవేశపెట్టిన రెడ్‌ మి 11 Pro+ను రీ బ్రాండ్‌ చేసి భారత మార్కెట్‌లోకి తెస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్‌ 5జీ సామర్థ్యం కూడా ఉందని సమాచారం.షియోమి 11i హైపర్‌చార్జ్‌ ప్రమోషన్‌ ఇమేజ్‌ను ఇప్పటికే కంపెనీ మార్కెట్‌ చేస్తోంది. ఇది కేవలం బ్లూ, పింక్‌ కలర్స్‌లో మాత్రమే లభిస్తుంది.