For Money

Business News

లాభాల్లో ముగిసిన మెట్రోబ్రాండ్స్‌

ఇవాళ మెట్రో బ్రాండ్స్‌ షేర్‌ లిస్టయింది. 13 శాతం నష్టంతో లిస్టయిన మెట్రో బ్రాండ్స్‌ … ట్రేడింగ్‌ ఆరంభంలో 15 శాతానికి క్షీణించి రూ. 426కు పడిపోయింది. ఈ కంపెనీ పబ్లిక్ ఆఫర్‌ కింద ఒక్కో షేర్‌ను రూ.500లకు ఆఫర్‌ చేసిన విషయం తెలిసిందే. ఇవాళ లిస్టింగ్‌ రోజు 15 శాతం క్షీణించినా… క్లోజింగ్‌కు ముందు రూ. 507.90కి చేరింది. కాని క్లోజింగ్‌లో రూ. 502 వద్ద ముగిసింది. మరోవైపు చాలా రోజుల తరవాత మోర్గాన్‌ స్టాన్లీ రీసెర్చి టీమ్‌… పే టీఎంకు కొనుగోలు చేయమని సలహా ఇచ్చింది. పేటీఎంకు ఉన్న కస్టమర్‌ బేస్‌ కారణంగా ఈషేర్‌ను రూ. 1875 టార్గెట్‌తో కొనుగోలు చేయొచ్చని సిఫారసు చేసింది. ఈ షేర్‌ ఇవాళ 2 శాతం లాభంతో రూ. 1338 వద్ద ముగిసింది. గోల్డ్‌మ్యాన్‌ శాచ్స్ మాత్రం ఈ షేర్‌కు న్యూట్రల్‌ రేటింగ్‌ ఇచ్చింది.