For Money

Business News

21 నెలల కనిష్ఠానికి టోకు ధరల సూచీ

దేశంలో టోకు ధరల ద్రవ్యోల్బణం 21 నెలల కనిష్ఠానికి చేరింది. నవంబర్‌ నెలలో 5.85 శాతంగా నమోదైనట్లు ఎన్‌ఎస్‌ఓ పేర్కొంది. ముఖ్యంగా ఆహార పదార్థాలు, చమురు, తయారీ వస్తువుల ధరలు తగ్గడమే దీనికి కారణం. ఈ సూచీ గడచిన 19 నెలలుగా రెండంకెల సంఖ్య పైనే నమోదవుతూ వస్తోంది. అక్టోబర్‌లో తొలిసారి 8.39 శాతానికి తగ్గిందని ఎన్‌ఎస్‌ఓ పేర్కొంది. గతేడాది నవంబర్‌లో 14.87 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం తాజాగా 5.85 శాతానికి చేరింది.