For Money

Business News

జేపీ సిమెంట్‌ ప్లాంట్‌ వొద్దు.. అల్ట్రాటెక్‌

రూ. 1000 కోట్లతో జయప్రకాష్‌ అసోసియేట్స్‌కు చెందిన సిమెంట్ ప్లాంట్లను కొనుగోలు చేయాలన్న ప్రతిపాదనను అల్ట్రాటెక్‌ సిమెంట్‌ విరమించుకుంది. ఉత్తరప్రదేశ్‌లో 30 లక్షల టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం ఉన్న ఈ ప్లాంట్‌తో సహా ఆరు ఇంటిగ్రేటెడ్‌ సిమెంట్ ప్లాంట్లు, అయిదు గ్రైండింగ్‌ ప్లాంట్లను అల్ట్రాటెక్‌ తీసుకోవాలని నిర్ణయించింది. ఈమేరకు రెండు కంపెనీల మధ్య ఒప్పందం కూడా ఉంది. ఈ ఒప్పందం ప్రకారం జూన్‌ 30వ తేదీకల్లా ఈ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంది. ఈ సిమెంట్‌ ప్లాంట్‌ పర్యావరణ అనుమతి అందాల్సి ఉంది. దీంతో ఈ ప్లాంట్‌ డీల్‌ నుంచి వైదొలగుతున్నామని అంటూనే.. రూ. 620 కోట్లయితే చెల్లిస్తామని పేర్కొంది.