For Money

Business News

ఉద్యోగులూ…. ఆఫీసుకు రావాల్సిందే

టీసీఎస్‌ తరవాత ఇపుడు విప్రో కూడా తన ఉద్యోగులను ఆఫీసు నుంచే పనిచేయాలని అంటోంది. వారంలో నాలుగు రోజులు ఆఫీసు తెరచి ఉంటుందని… ఆ రోజుల్లో మూడు రోజులు ఆఫీసు నుంచే పనిచేయాల్సి ఉంటుందని ఉద్యోగులకు పంపిన నోటీసులో పేర్కొంది. భారతదేశంలోని ఉద్యోగులందరికీ కొత్త నిబంధన వర్తిస్తుందని, ఈనెల 10వ తేదీ నుంచి దీన్ని అమలు చేస్తున్నట్లు విప్రో పేర్కొంది. బుధవారం మినహా.. సోమ, మంగళ, గురు, శుక్రవారాల్లో ఉద్యోగులు ఆఫీసుకు రావాల్సి ఉంటుంది. మధ్యలో బుధవారం సెలవు ప్రకటించడంతో.. సెలవు ముందు ఆ తరవాత కూడా ఆఫీసుకు రావాల్సి ఉంటుంది. అంటే వరుసగా మూడు రోజులు పనిచేయడం కుదరదు.