For Money

Business News

థర్డ్‌ పార్టీ ఇన్సూరెన్స్‌ భారీగా పెంపు

థర్డ్‌ పార్టీ ఇన్సూరెన్స్‌ను భారీగా పెంచుతూ కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ, ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ అథారిటీ ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త రేట్లను ఇవాళ నోటిఫై చేశాయి. కొత్త రేట్లు జూన్‌ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. కరోనా కారణంగా మూడేళ్ళ తరవాత థర్డ్‌ పార్టీ ప్రీమియంను పెంచుతున్నారు. అందుకే భారీగా పెంచారు. ఈ ప్రీమియంలు మూడేళ్ళు, అయిదేళ్ళకు కూడా ఉంటాయి.

కొత్త టూ వీలర్స్‌కు (అయిదేళ్ళ సింగిల్‌ ప్రీమియం)
75 CC లోపు టూ వీలర్స్‌ రూ. 2901
75 CC దాటి.. 150 CC లోపు అయితే ప్రీమియం రూ.3851 చేశారు.
75 CC దాటి 350 సీసీ లోపు అయితే ప్రీమియం రూ.7365
350 సీసీ దాటితే ప్రీమియం రూ.15,117

కొత్త ప్రైవేట్‌ కారు (మూడేళ్ళ ప్రీమియం)

1000 సీసీ దాటితే రూ.6521
1000 సీసీ దాటి 1500 సీసీ లోపలైతే రూ. 10640
1500 సీసీ దాటితే రూ.24,596

మిగిలిన వాహనాల ప్రీమియం వివరాలు ఇంకా అందాల్సి ఉంది.