For Money

Business News

టెస్లా: బుకింగ్స్‌ రీఫండ్‌

అమెరికాకు చెందిన ఈవీ కంపెనీ టెస్లా భారత ఎంట్రీ మరింత ఆలస్యం కానుంది. ఇటీవలే షోరూమ్స్‌ను బుక్‌ చేయడంతో త్వరలోనే టెస్లా కార్ల భారత రోడ్లపై దర్శనమిస్తాయని భావించారు. అయితే 2016లో చేసిన బుకింగ్స్‌కు సంబంధించిన మొత్తాన్ని ఇపుడు కంపెనీ వెనక్కి ఇచ్చేస్తోంది. మోడల్‌ 3 కోసం గతంలో కంపెనీ అడ్వాన్స్‌ బుకింగ్స్‌ ప్రకటించింది. ఒకవైపు అమెరికాతో ఆటో టారిఫ్‌పై భారత్‌ చర్చలు జరుపుతుండగా, ఈ ఏడాది భారత్‌ పర్యటిస్తానని టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో టెస్లా కార్లు చాలా త్వరగా భారత్‌కు వస్తాయని భావించారు ఆటో విశ్లేషకులు. అయితే ఈవీ మార్కెట్‌లో చైనా కంపెనీలు దూసుకు వస్తున్నాయి. ముఖ్యంగా ఎంజీ, బీవైడీ బుకింగ్స్‌ ఇటీవల మన దేశంలో బాగా పెరిగాయి. ఇపుడున్న టారిఫ్స్‌తో ఈ మోడల్స్‌తో పోటీ పడటం కష్టమని టెస్లా భావిస్తున్నట్లు తెలుస్తోంది. టారిఫ్‌ మార్పుల తరవాత కొత్త మోడల్స్‌ను భారత్‌కు తెస్తుందేమో చూడాలి.