For Money

Business News

దుబాయ్‌ ఎక్స్‌పోలో తెలంగాణ

నవంబర్‌ నెల 5 నుంచి 11 వ తేదీ వరకు దుబాయ్‌ ఎక్స్‌పో-2021లో తెలంగాణ ప్రభుత్వం పాల్గొంటోంది. తెలంగాణలో పర్యాటక, పారిశ్రామిక రంగాల్లో సాధించిన ప్రగతిని ప్రదర్శిస్తూ అంతర్జాతీయ స్థాయిలో ఆయా రంగాల నుంచి పెట్టుబడులు ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎక్స్‌పోలో ప్రయత్నం చేస్తుంది. తెలంగాణలో పర్యాటక రంగం, పారిశ్రామిక రంగంలో ఉన్న పెట్టుబడుల అవకాశాలను ఈ ఎక్స్‌పోలో వివరించనున్నారు. ఈ ఎక్స్‌పోలో తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌తో పాటు పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్‌ ఉప్పల శ్రీనివాస్‌ గుప్తా, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌, టీఎస్‌ఐఐడీసీ ఎండీ వెంకట్‌నర్సింహారెడ్డి పాల్గొననున్నారు.