For Money

Business News

కొనసాగుతున్న టెక్‌ ర్యాలీ

ఐటీ, టెక్‌ షేర్లలో ర్యాలీ కొనసాగుతోంది. డాలర్‌ ఇండెక్స్‌ పెరిగినా… ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. డౌజోన్స్‌ మాత్రం క్రితం స్థాయి వద్దే ఉంది. ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ 0.35 శాతం లాభంతో ఉంది. నెట్‌ఫ్లిక్స్‌ తన గైడెన్స్‌ పెంచడంతో టెక్ షేర్ల సెంటిమెంట్‌ మెరుగుపడింది. వడ్డీ రేట్లు పెరిగినా అమెరికాలో పాత ఇళ్ళ ధరలు బాగా పెరిగాయి. దీంతో అమ్మకాలు తగ్గాయి. మరోవైపు ట్రజరీ బాండ్స్‌ ఈల్డ్స్‌ ఇవాళ పెరిగాయి. క్రూడ్‌ ధరల్లో పెద్ద మార్పు లేదు. బ్రెంట్‌ క్రూడ్‌ 107 డాలర్ల వద్ద ఉంది. అంతకుమునుపు యూరో మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. అయితే పెద్ద మార్కెట్లు స్వల్ప నష్టాలకే పరిమితమయ్యాయి.