For Money

Business News

టెక్‌ మహీంద్రా లాభంలో 26% వృద్ధి

సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో టెక్‌ మహీంద్రా రూ.1,338.7 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో కంపెనీ ఆర్జించిన నికర లాభం రూ.1,064.6 కోట్లు. నికర లాభం 25.7 శాతం పెరగ్గా టర్నోవర్‌ 16 శాతం పెరిగింది. గత ఏడాది ఇదే కాలంలలో ఉన్న ఆదాయం రూ.9,371.8 కోట్ల నుంచి రూ.10,881.3 కోట్లకు చేరింది. అదే గత త్రైమాసికంతో పోలిస్తే మాత్రం నికర లాభం 1 శాతం, ఆదాయం 6.7 శాతం తగ్గాయి. ఒక్కో షేరుకు ప్రత్యేక డివిడెండుగా రూ.15ను బోర్డు సిఫారసు చేసింది. ప్రస్తుత త్రైమాసికంలో కొత్త 14,930 మంది ఉద్యోగులను తీసుకోవడంతో కంపెనీలో ఉద్యోగు ల సంఖ్య 1,41,193కు చేరింది.