For Money

Business News

దీపావళి నాటికి జియో ఫోన్‌ నెక్ట్స్‌

ఎట్టకేలకు జియో నెక్ట్స్‌ ఫోన్‌ దీపావళికి రానుంది. ప్రగతి ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో దీన్ని మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నారు. జియో ప్లాట్‌ఫారమ్స్‌, గూగుల్‌ ఉమ్మడిగా ‘ప్రగతి ఆపరేటింగ్‌ సిస్టమ్‌’ను అభివృద్ధి చేశాయి.క్వాల్‌కామ్‌ చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్‌, టచ్‌ స్ర్కీన్‌ దీని ప్రత్యేకతలు. ఇది భాషా అనువాద ఫీచర్‌ కలిగి ఉంటుంది. దీని వల్ల అవతలి వ్యక్తి ప్రాంతీయ భాషలో చెప్పే సందేశం ఇవతలి వారికి వారి భాషలోనే వినే అవకాశం కల్గుతుంది. మొత్తం 10 భాషలను అనువాదం చేయగల సామర్థ్యం దీనికి ఉంది. స్ర్కీన్‌ మీద ఓపెన్‌ అయ్యే ఏ యాప్‌లో సమాచారం అయినా ఇది చదివి వినిపిస్తుంది. రిలయన్స్‌కు చెందిన తిరుపతి, శ్రీ పెరంబుదూర్‌లోని నియోలింక్‌ యూనిట్‌లో ఈ ఫోన్‌ తయారవుతుంది.