For Money

Business News

‘యెల్లో కార్ట్’ ప్రారంభించిన టీడీపీ

తెలుగుదేశం పార్టీని అన్నివర్గాలకు చేరవేసేందుకు పార్టీ అనుబంధంగా పనిచేస్తున్న తెలుగు ప్రొఫెషనల్స్ వింగ్ యెల్లో కార్ట్‌ పేరుతో ఓ మర్చంటైజ్‌ను ప్రారంభించింది. తెలుగుదేశం పార్టీని పార్టీ అభిమానులు, కార్యకర్తల లైఫ్ స్టైల్లో భాగం చేసేందుక *‘యెల్లో కార్ట్’* (http://Yellowkart.in) వెబ్ సైట్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ వెబ్ సైట్‌ను సినీ హీరో నారా రోహిత్ ఆవిష్కరించారు. యెల్లో కార్ట్ వెబ్ సైట్ లో టీడీపీ థీమ్ తో రూపొందించిన టీ-షర్టులు, క్యాప్ లు, బ్యాడ్జీలు మరియు కాఫీ మగ్‌లు అందుబాటులో ఉంచారు. పార్టీలో, ప్రజల్లో ఐక్యతను చాటిచెప్పేందుకు ఈ యెల్లో కార్ట్ తోడ్పడుతుందని తెలుగు ప్రొఫెషనల్స్ వింగ్ అధ్యక్షురాలు తేజస్వి పొడపాటి తెలిపారు.