For Money

Business News

చక్కెర షేర్లు జిగేల్‌

చక్కెర కంపెనీల షేర్లు గత కొన్ని రోజులుగా మార్కెట్‌లో మెరుస్తున్నాయి. ఇవాళ సూచీలు నష్టాల్లో ముగిసినా బలరాంపూర్ చినీ, ద్వారకేష్ సుగర్‌, త్రివేణి ఇంజినీరింగ్ వంటి చక్కెర షేర్లు ఇవాళ కూడా లాభాల్లో ముగిశాయి. గతవారం కూడా బలరామ్‌పూర్ చినీ, ద్వారకేష్ సుగర్‌, ఉత్తమ్ సుగర్స్, అవధ్ సుగర్‌ 20 శాతం నుంచి 27 శాతం దాకా పెరిగాయి. ఇటీవల ప్రభుత్వం బయో డీజిల్‌పై జీఎస్టీ తగ్గించడం ఈ కంపెనీలకు బాగా కలిసి వస్తోంది. అలాగే వచ్చే మూడేళ్లలో డిస్టిలరీ సామర్థ్యాలను పెంచడంపై కంపెనీలు దృష్టి పెట్టాయి. పెట్రోల్‌, డీజిల్‌ రేట్లు మున్ముందు మరింత పెరుగుతాయనే అంచనాతో ఇథనాల్‌కు మరింత డిమాండ్‌ రావొచ్చు. 2019-21 మధ్య కాలంలో చక్కెర పరిశ్రమ ఎగుమతులు కూడా బాగా పెరిగాయి.