For Money

Business News

దిమ్మ తిరిగే లిస్టింగ్‌

ఇటీవలి కాలంలో ఏ ఐపీఓకు దక్కని ఘనత మ్యాన్‌కైండ్‌ ఫార్మాకు దక్కింది. ఇవాళ ఈ షేర్‌ పబ్లిక్‌ ఆఫర్‌ రికార్డు స్థాయి లాభాలను పొందింది. 2020లో గ్లాండ్‌ ఫార్మా తరవాత అద్భుత ప్రీమియంతో ముగిసింది. రూ. 1080లకు ఈ కంపెనీ షేర్లను అలాట్‌ చేయగా… ఇవాళ రూ. 1300 వద్ద లిస్టయింది. అక్కడి నుంచి రూ. 1430లను కూడా తాకింది. లిస్టింగ్‌తో ఈ షేర్‌ 32 శాతం లాభాన్ని ఇచ్చింది ఇన్వెస్టర్లకు. ఈ షేర్‌ అప్పర్‌ సీలింగ్‌ రూ. 1430 వద్ద ముగిసింది. చివరి నిమిషంలో ఈ షేర్‌ రూ. 1422 వద్ద కూడా ట్రేడవుతున్నట్లు తెలుస్తోంది. సాధారణ ఇన్వెస్టర్ల పోర్షన్‌ ఒక మోస్తరుగా మాత్రమే ఓవర్‌ సబ్‌స్క్రయిబ్‌ అయింది. అయితే సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి భారీ డిమాండ్‌ రావడంతో ఈ షేర్‌ గణనీయంగా పెరిగింది. రేపు కూడా ఈ షేర్‌ లాభాలతో ప్రారంభమయ్యే అవకాశముంది.