For Money

Business News

ఇవాళ కూడా బులియన్‌ జూమ్‌

అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్‌, బులియన్‌ జోరు కొనసాగుతోంది. ఇవి రెండూ పెరగడం వల్ల భారత మార్కెట్‌లో ముఖ్యంగా బులియన్‌ మార్కెట్‌పై డబుల్‌ ఎఫెక్ట్‌ పడింది. స్పాట్‌ మార్కెట్‌లో హైదరాబాద్‌లో కూడా ఆర్నమెంట్‌ (22 క్యారెట్లు) బంగారం ధర రూ. 700 పెరిగి రూ. 45,900కి చేరింది. ఇక స్టాండర్డ్‌ బంగారం (24 క్యారెట్లు) రూ. రూ. 760 పెరిగి రూ. 50,070కి చేరింది. ఇక కిలో వెండి రూ. 1,800 పెరిగి రూ. 66500లకు చేరింది. ఎంసీఎక్స్‌లో నిన్న భారీగా పెరిగిన వెండి ఇవాళ కూడా (డిసెంబర్‌ కాంట్రాక్ట్‌) రూ. 742 పెరిగి రూ. 66,620 వద్ద ట్రేడవుతోంది. ఇక బంగారం కూడా రూ. 433 పెరిగి రూ.49,287కు చేరింది.