For Money

Business News

శ్రీలంక: నివాసం నుంచి అధ్యక్షుడు పరార్‌

ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో ఒక్కసారిగా విషమించింది. ఆందోళన కారులు ఏకంగా తమ అధ్యక్ష భవనంలోకి దూసుకెళ్ళారు. భవనంలోకి వెళ్ళి హంగామా సృష్టించారు. నిరసనకారులు తమ భవనంలోకి రావడంతో అధ్యక్షుడు రాజపక్సే పరారయ్యారు. కొలంబోలోని కోటపై ఉన్న ఆయన భవనంలో ఆందోళన కారులు దూసుకురావడంతో భద్రతాదళాలు వారిపై నీటి కేనన్లు ఉపయోగించారు. అయినా పట్టించుకోని ఆందోళనకారులు భవనంలోకి దూసుకెళ్ళారు. భవనంపైన నిలబడి నినాదాలు చేశారు.భవనంలో తమ కంట కనబడిన ఎంపీ రజిత సేనరత్నేను చితకబాదారు.