For Money

Business News

పే టీఎం షేర్‌ అమ్మండి…మాక్వెరి

ప్రస్తుత ధర వద్ద పేటీఎం షేర్‌ను అమ్మవచ్చని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ రీసెర్చి సంస్థ మాక్వెరీ పేర్కొంది. తాజా పరిశోధన రిపోర్టులో పేటీఎం షేర్‌ టార్గెట్‌ ధరను రూ. 1,200గా పేర్కొంది. గత డచిన త్రైమాసికంతో పోలిస్తే తాజా త్రైమాసికంలో కంపెనీ నెట్‌ పేమెంట్స్‌ ఆదాయం 22 శాతం క్షీణించినట్లు సంస్థ పేర్కొంది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి కంపెనీ అంచనా వేసిన నష్టంలో ఇప్పటికే కంపెనీ నష్టాలు 70 శాతానికి చేరినట్లు పేర్కొంది. అంటే మున్ముందు నష్టాలు మరింత పెరిగి అంచనాను దాటుతాయని పేర్కొంది. గత ఏడాదితో పోలిస్తే ఆదాయం వృద్ధి రేటు 107 శాతం నుంచి 44 శాతానికి పడిపోయినట్లుపేర్కొంది. అలాగే మార్కెట్‌లో పోటీ పెరిగి ఆదాయం మరింత తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. ప్రస్తుతం ఈ షేర్‌ రూ. 1,783 వద్ద ట్రేడవుతోంది.