For Money

Business News

 మీరు సైఫాబాద్‌ మింట్‌ను చూడొచ్చు

సైఫాబాద్‌లోని మింట్‌ను కాయిన్‌ మ్యూజియంగా మార్చిన విషయం తెలిసిందే. నిన్న ఈ మ్యూజియం ప్రారంభించారు. ఇవాళ్టి నుంచి ప్రజల సందర్శనకు అనుమతిస్తున్నారు. ఈనెల 13 వరకు ప్రజలను అనుమతిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రజలను అనుమతిస్తారు. ఈ మింట్‌ను 1903లో ఆరవ హైదరాబాద్ నిజామ్‌ మీర్‌ మహబూబ్‌ అలి ఖాన్‌ నెలకొల్పారు. యూరప్‌లోని మింట్‌ మాదిరిగా దీన్ని స్థాపించారు. మింట్‌ను చర్లపల్లెకు మార్చిన తరవాత సైఫాబాద్‌ మింట్‌ శిథాలావస్థకు చేరింది. మింట్‌ పునరుద్ధరించి కాయిన్‌ మ్యూజియంగా మార్చారు.