హైదరాబాద్లో శాఫ్రాన్ రూ.1200 కోట్ల పెట్టుబడి
ఫ్రాన్స్కు చెందిన బహుళజాతి సంస్థ శాఫ్రాన్ హైదరాబాద్లో తమ అతిపెద్ద, తొలి ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్ మెయింటేనెన్స్, రిపేర్, ఓవరాల్ (ఎంఆర్వో) కేంద్రాన్ని నెలకొల్పనుంది. ఎయిర్క్రాఫ్ట్, రాకెట్ ఇంజిన్ల డిజైన్, తయారీలో ఈ కంపెనీకి మంచి పేరుంది. ఎయిర్బస్ గ్రూప్, బోయింగ్లకు అనేక కీలక విడి పరికరాలను తయారు చేసేఏ ఈ కంపెనీ 2018 ఫిబ్రవరిలో జోడియాక్ ఏరోస్పేస్ను శాఫ్రాన్ చేజిక్కించుకోవడంతో పెద్ద కంపెనీగా అవతరించింది. ఈ కంపెనీ ఇపుడు హైదరాబాద్లో రూ.1,200 కోట్లతో ప్లాంట్ను ఏర్పాటు చేస్తోంది. ఈ విషయాన్ని రాష్ట్ర మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.ప్రస్తుతం దేశ, విదేశాల్లో నడుస్తున్న ఎన్నో ఎయిర్లైన్స్ విమానాల్లో శాఫ్రాన్ ఇంజిన్లే ఉన్నాయి. ఇకపై వీటి మెయింటేనెన్స్, రిపేర్, ఓవరాల్ అంతా హైదరాబాద్లో జరగనుంది.