For Money

Business News

రూ. 11 కోట్ల నాణేలు మాయం

ఎస్‌బీఐకి చెందిన ఓ బ్రాంచి నుంచి రూ. 11 కోట్ల నాణేలు మాయం అయ్యాయి. ఈ కేసుకు సంబంధించి ఇవాళ 25 చోట్ల సీబీఐ దాడులు నిర్వహించింది. రాజస్థాన్‌లోని కరౌలి ఎస్‌బీఐ బ్రాంచి నుంచి రూ. 11 కోట్ల నాణేలు మాయమయ్యాయి. దీనికి సంబంధించి ఈ ఏడాది ఏప్రిల్‌ 13వ తేదీన సీబీఐ కేసు నమోదు చేసింది. ఢిల్లీ,జైపూర్, దౌసా, కరౌలి, సవాయి, మధోపూర్‌, అల్వార్‌, ఉదయ్‌పూర్‌, భిల్వారాలో 15 మంది ఎస్‌బీఐ మాజీ అధికారులు, వారి సంబందీకుల ఇళ్ళపై సీబీఐ దాడులు నిర్వహించింది. 2021లోనే ఈ బ్రాంచిలో నాణేల నిల్వలకు సంబంధించి అనుమానం రావడంతో ఎస్బీఐ ఉన్నతాధికారులు ప్రాథమిక విచారణ జరిపారు. అపుడు నాణేలు మాయమైన విషయం బయటపడింది.