For Money

Business News

రిలయన్స్‌ చేతికి లోటస్‌ చాకొలేట్‌

హైదరాబాద్‌కు చెందిన లోటస్‌ చాకొలేట్‌ కంపెనీని రిలయన్స్‌ రీటైల్‌ టేకోవర్‌ చేసింది. నటి శారత నెలకొల్పిన ఈ కంపెనీని 2008లో పజోలనా గ్రూప్‌ టేకోవర్‌ చేసింది. బీఎస్‌ఈలో లిస్టయిన ఈ కంపెనీలో ప్రమోటర్లకు 72 శాతం వాటా ఉండగా, 51 శాతం వాటా అంటే కంట్రోలింగ్‌ వాటాను రిలయన్స్‌ రిటైల్‌ తీసుకోనుంది. తన అనుబంధ సంస్థ అయిన రిలయన్స్‌ కన్జూమర్‌ ప్రొడక్ట్స్‌ ద్వారా లోటస్‌ చాకొలేట్‌ను టేకోవర్‌ చేస్తున్నారు. 51 శాతం వాటాను రూ. 74 కోట్లకు రిలయన్స్‌ తీసుకుంటోంది. ఒక్కో షేర్‌ను రూ. 113 ధరకు కొనుగోలు చేస్తోంది. ఈ కంపెనీ షేర్‌ నిన్న బీఎస్‌ఈలో రూ. 111.55 వద్ద ముగిసింది. ఇవాళ షేర్‌ 5 శాతం అప్పర్‌ సీలింగ్‌తో రూ. 117.10 వద్ద క్లోజైంది. 51 శాతం వాటాను కొనుగోలు చేసిన రిలయన్స్‌ కంపెనీ మరో 26 శాతం వాటా కోసం ఓపెన్‌ ఆఫర్‌ చేయనుంది.