For Money

Business News

రూ. 10,000లకే రిలయన్స్‌ 5జీ ఫోన్‌ ?

ఈ ఏడాది చివరినాటికల్లా దేశంలో 5జీ సర్వీసులు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. దాదాపు 1000 నగరాల్లో 5జీ సేవలు అందించేందుకు తాము సిద్ధమేనని రిలయన్స్‌ ఇప్పటికే ప్రకటించింది. దీంతో ఈ కంపెనీ ప్రారంభించే బోయే 5 జీ ఫోన్ల గురించి మార్కెట్‌లో చర్చ మొదలైంది. రిలయన్స్‌ జియో ప్రవేశపెట్టే 5జీ ఫోన్‌ ధర రూ. 10,000 ఉండొచ్చని మార్కెట్‌లో వార్తలు వస్తున్నాయి. 5జీ ప్లాన్‌లు కూడా కస్టమర్లకు అనుకూలంగా ఉండేలా ప్లాన్‌ చేస్తోంది కంపెనీ. జియోఫోన్‌ మాదిరిగా ఈ ఫోన్లను ఈఎంఐ ఆప్షన్లతో కంపెనీ అందించనుంది. క్వాలక్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 450 SoCపై పని చేసేలా ఈ ఫోన్‌లను తయారు చేస్తున్నారు. ఇది ఎంట్రీ లెవల్‌ ఫోన్‌ మాత్రమే. మరిన్ని సౌకర్యాలతో కూడా ఈ ఫోన్లు వచ్చే అవకాశముంది. 6.5 ఇంచీల IPS LCD HD+ (1600 x 720) డిస్‌ప్లేతో ఈ ఫోన్లు రానున్నాయి.