For Money

Business News

రిజిస్ట్రేషన్ ఛార్జీలను సగానికి తగ్గించాలి

రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ ఛార్జీలను సగానికి తగ్గించాలని తెలంగాణ బిల్డర్స్ సమాఖ్య (టీబీఎఫ్) ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో రిజిస్ట్రేషన్‌ చార్జీలను 7.5 శాతానికి పెంచారు. దీన్ని చార్జీలను 4 శాతానికి తగ్గించాలని సమాఖ్య కోరుతోంది. గ్రేటర్ హైదరాబాద్‌లోని ఏడు సంఘాలతో కూడిన తెలంగాణ బిల్డర్స్ సమాఖ్య మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం తరచూ మార్కెట్ విలువలు పెంచుతుండటంతో కొనుగోలుదారులకు రిజిస్ట్రేషన్ ఛార్జీలు భారంగా మారాయని పేర్కొంది. ఇలాగైతే అందుబాటు ధరల్లో ఇళ్లు కట్టే చిన్న బిల్డర్లు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడుతుందని సమాఖ్య అధ్యక్షుడు సీ ప్రభాకరరావు పేర్కొన్నారు.