For Money

Business News

ఒకే రోజు 53 ఒప్పందాలు

తెలంగాణ రాష్ట్రప్రభుత్వం నిన్న ఒక్కరోజే 53 కార్పొరేటు సంస్థలతో అవగాహన ఒప్పందాలు (ఎంఓయూ) కుదుర్చుకొంది. వీటి ద్వారా 1.50 లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ నైపుణ్య, విజ్ఞాన సంస్థ ( తెలంగాణ ఆకాడమీ ఫర్ స్కిల్స్ నాలెడ్జ్ – టాస్క్), పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ సమక్షంలో టీహబ్ 2.0లో ఈ ఒప్పందాలు జరిగాయి. 26 కొత్త సంస్థలతో ఒప్పందాలు, 27 పాత సంస్థలతో పునరుద్ధరణకు సంబంధించిన ఒప్పందాలపై టాస్క్ సీఈవో సిన్హా , ఆయా సంస్థల ప్రతినిధులు సంతకాలు చేశారు. ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్న సంస్థల్లో ఎల్అండ్ మెట్రో రైల్‌, భారత్ ఫోర్జ్‌, కల్యాణి రాఫెల్ 24/7, హెటిరో, హైసియా, ఇన్ఫోసిస్ స్ప్రింగ్‌ బోర్డ్, వాహన్, విడాల్, రుబికాన్, హెడ్ హెల్త్ హైలు కూడా ఉన్నాయి. టాస్క్‌ను హైదరాబాద్ వరకే కాకుండా ఖమ్మం, కరీంనగర్, సిరిసిల్ల వరంగల్‌, నల్గొండ, మహబూబ్‌ నగర్‌లకు విస్తరించామని కేటీఆర్‌ అన్నారు..