For Money

Business News

రిలయన్స్ క్యాపిటల్ దివాలా

దేశంలో నంబర్ వన్‌ సంపన్నుడు రిలయన్స్‌ అధినేత ముకేష్‌ అంబానీ సోదరుడు అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్‌ కంపెనీ దివాలా తీసింది. కంపెనీ బోర్డును భారత రిజర్వు బ్యాంక్‌ (ఆర్‌బీఐ) రద్దు చేసింది. తీసుకున్న అప్పులు చెల్లించడంలో కంపెనీ విఫలం కావడంతో ఆర్‌బీఐ ఈ చర్య తీసుకుంది. కంపెనీ నిర్వహణకు సంబంధించి కూడా అనేక లోపాలు ఉన్నట్లు గుర్తించింది. బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర మాజీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వై నాగేశ్వరరావును అడ్మినిస్ట్రేటర్‌గా నియమించింది. త్వరలోనే దివాలా ప్రక్రియ ప్రారంభమౌతుందని ఆర్‌బీఐ పేర్కొంది.